‘జగన్ అనే నేను’..

Update: 2018-07-25 13:26 GMT

ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ‘జగన్ అనే నేను’ డైలాగ్ వచ్చింది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో జగన్ 220వ రోజు పాదయాత్ర జరిగింది. అనంతరం పెద్దాపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పోలవరం నిర్మాణం శరవేగంగా సాగిందని, కానీ చంద్రబాబు హయాంలో కనీసం పునాది గోడలు కూడా కట్టలేదన్నారు. పోలవరంలో కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి చంద్రబాబు తరచూ పోలవరం వస్తున్నారని ఆరోపించారు. పెద్దాపురం నియోజకవర్గంలో కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు. మద్యం వల్ల పేదల జీవితాలు చిత్రమవుతున్నాయని, ‘జగన్ అనే నేనుి అధికారంలోకి వస్తే 2024 ఎన్నికల్లో ఓటు అడగానికి వచ్చే ముందే ఒక్క మద్యం దుకాణం కూడా ఉండకుండా చేస్తానని ప్రకటించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలు, వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు.

Similar News