బ్రేకింగ్: డేటా చోరీ కేసులో బిగుస్తున్న ఉచ్చు

ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసిన కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న అశోక్ దాకవరపు కోసం సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. [more]

Update: 2019-03-04 06:50 GMT

ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేసిన కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న అశోక్ దాకవరపు కోసం సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, కావలి, విజయవాడ, విశాఖపట్నంలో ఆయన కోసం ఆరా తీస్తున్నారు. ఇక, ఐటీ గ్రిడ్ సంస్థపై మరో కేసు నమోదైంది. తమ సమాచారాన్ని దొంగతనంగా తీసుకొని సేవా మిత్ర యాప్ దుర్వినియోగం చేస్తుందని రాంరెడ్డి అనే వ్యక్తి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ గ్రిడ్ సంస్థపై మరో కేసు నమోదైంది. ఈ కేసు గురించి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పోలీసులు మీడియాతో మాట్లాడనున్నారు. ఇక ఈ కేసులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు కూడా స్పష్టం చేసింది.

Tags:    

Similar News