బ్రేకింగ్ ; టీడీపీకి షాకిచ్చిన హస్తం

Update: 2018-11-22 03:51 GMT

నామినేషన్లకు ఈరోజు చివరితేదీ కావడంతో రెబల్స్ ను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్ లు రెబల్స్ తో చర్చలు జరుపుతున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇబ్రహీంపట్నంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డికి మద్దతివ్వాలని కాంగ్రెస్ సీనియర్లు నిర్ణయించారు. పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. సామారంగారెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు.

సామా ఏం చేస్తారు....?

సామా రంగారెడ్డి ఎల్ బి నగర్ కోరుకున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా సుధీర్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపిక చేయడంతో సామా రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో నామినేషన్ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా మల్ రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ సీనియర్లు మద్దతు ప్రకటించడంతో టీడీపీ అభ్యర్థి ఇప్పుడు ఏం చేస్తారన్నది చర్చనీయాంశమైంది. నామినేషన్ ఉపసంహరించుకుంటారా? లేక బరిలో ఉంటారా? అన్నది ఈరోజు తేల్చనుంది.

Similar News