ఏపీలో ఐటీ దాడులు వీరిపైనేనా?

Update: 2018-10-05 03:42 GMT

విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. వివిధ కనస్ట్రక్షన్స్ కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. స్థానిక పోలీసుల సహకారంతో ఈ దాడులు జరుగుతున్నాయి. మొత్తం ఎనిమిది బృందాలు విడిపోయి ఈ దాడులు చేస్తున్నారు. రెండోరోజు కూడా నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు బీద మస్తాన్ రావు, బీద రవిచంద్ర కార్యాలయాలు, ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. సదరన్ కనస్ట్రక్షన్స్, వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీలలో ప్రస్తుతం ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ రెండు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి. గంటూరులో రైల్వే కోచ్ నిర్మాణాలు, మరమ్మతుల పనిని వీఎస్ లాజిస్టిక్ కంపెనీ చేస్తుంది. ప్రజాప్రతినిధుల ఇళ్లపై కూడా దాడులు జరుగుతాయన్న ప్రచారం అమరావతిలో జోరుగా సాగుతోంది.

Similar News