బ్రేకింగ్ : దినకరన్ ఆఫీస్ లో ఐటీ దాడులు…కోటి స్వాధీనం

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళంగం కార్యాలంయంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. దినకరన్ పార్టీ కార్యాలయం నుంచి కోటి [more]

Update: 2019-04-17 03:39 GMT

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళంగం కార్యాలంయంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. దినకరన్ పార్టీ కార్యాలయం నుంచి కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆదాయపు పన్ను శాఖ దాడులను పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో 150 మంది దినకరన్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటకలో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ దాడులు మోదీ కుట్రేనని టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారం తమిళనాడులో నిన్న ముగిసింది. తమిళనాడు, కర్ణాటకలో ఐటీ దాడులు రాజకీయంగా కలకలం రేపుతోంది.

Tags:    

Similar News