ప్రారంభమయిన పశ్చిమబెంగాల్, అసోం తొలి దశ ఎన్నికలు

పశ్చిమ బెంగాల్, అసోంలో నేడు తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమయింది. పశ్చిమ బెంగాల్ లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు తొలిదశలో ఎన్నికలు [more]

Update: 2021-03-27 02:02 GMT

పశ్చిమ బెంగాల్, అసోంలో నేడు తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమయింది. పశ్చిమ బెంగాల్ లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్ లో మొత్తం 30 స్థానాలకు 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇవి ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉండే స్థానాలు. ఇక్కడ 30 నియోజకవర్గాల్లో 2016 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 27 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల కోసం భారీ భద్రత ఏర్పాట్లను ఎన్నికల కమిషనర్ చేసింది. అసోంలో 47 స్థానాలకు 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Tags:    

Similar News