ఏపీలో ఆ పంచాయతీలకు మళ్లీ ఎన్నికలు?

ఆంధప్రదేశ్ లో నాలుగుదశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నాలుగు విడతల్లో 2,197 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 47,459 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. చివరకు [more]

Update: 2021-02-22 01:25 GMT

ఆంధప్రదేశ్ లో నాలుగుదశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నాలుగు విడతల్లో 2,197 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 47,459 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. చివరకు నాలుగు దశల్లో 10,890 పంచాయతీలకు, 82,894 వార్డులకు ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించింది. అయితే వీటిలో పది పంచాయతీలకు, 670 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో ఇక్కడ ఎన్నికలు తిరిగి నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులు ఎన్నికల కమిషన్ కు నివేదిక అందించారు.

Tags:    

Similar News