ఏపీ ప్రజలకు కొంత ఊరట

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించింది. నిన్నటి వరకూ ఉదయం ఆరు గంటల నుంచి 9గంటల వరకే రోడ్డు మీదకు అనుమతించేది. అయితే మూడు [more]

Update: 2020-03-26 04:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించింది. నిన్నటి వరకూ ఉదయం ఆరు గంటల నుంచి 9గంటల వరకే రోడ్డు మీదకు అనుమతించేది. అయితే మూడు గంటలే రోడ్లమీదకు రావడానికి వీలుండటంతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేేసేందుకు ఒక్కసారిగా జనం బయటకు వస్తున్నారు. దీంతో రోడ్లపైనా, రైతు బజార్లపైన రద్దీ పెరుగుతోంది. దీనిని గమనించిన ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిత్యావసరవస్తువుల షాపులు తెరిచే ఉంటాయని ప్రభుత్వం వేళలను సడలించింది. దీంతో కొంత ఏపీ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News