బ్రేకింగ్ : ఏపీలో మొత్తం 603 కేసులు.. కృష్ణా జిల్లాలో అత్యధికంగా?

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. ఈ మేరకు [more]

Update: 2020-04-18 05:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కృష్ణా జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 18 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో ఐదు, నెల్లూరు నెల్లూరులో మూడు, ప్రకాశం జిల్లాలో రెండు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. వైద్య పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తుండటంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశముందన ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 15 మంది మృతి చెందారు.

Tags:    

Similar News