భార్యపై కత్తితో దాడి… మనస్పర్థలే కారణం

ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకు మనస్పర్ధలొచ్చి వేర్వేరుగా జీవనం సాగిస్తున్న భార్య పై కత్తితో దాడి చేశాడు భర్త. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ [more]

Update: 2020-10-02 02:24 GMT

ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకు మనస్పర్ధలొచ్చి వేర్వేరుగా జీవనం సాగిస్తున్న భార్య పై కత్తితో దాడి చేశాడు భర్త. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నాంపల్లికి చెందిన వెంకటేష్, శంకర్ పల్లి మండలం అంతప్పగూడకు చెందిన సుజాత లు గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరి మద్య మనస్పర్ధలు రావడంతో విడిపోయి వేర్వేరుగా అమె వికారాబాద్ లో తను హైదరాబాద్ లో ఉంటున్నారు. భర్త వెంకటేష్ పై భార్య సుజాత వికారాబాద్ మహిళ పోలీస్ ఫిర్యాదు చెసింది. విషయం తెలుసుకున్న వెంకటేష్ భార్య తో మాట్లాడుదామని వికారాబాద్ కు వచ్చి తను పని చేస్తున్న లేడిస్ కార్నర్ దగ్గర గొడవపడి మాటమాట పేరగడంతో భార్యపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన సుజాతను స్థానికులు వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News