ఎల్జీ పాలిమర్స్ పై హైపవర్ కమిటీ విచారణ

ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో హై పవర్ కమిటీ విచారణ రెండో రోజు కొనసాగుతుంది. ప్రమాదంతో పాటు ఆ పరిశ్రమకు సంబంధించిన కాలుష్యంపై ప్రజాభిప్రాయాలను సేకరించనుంది. ప్రభావిత [more]

Update: 2020-06-07 05:43 GMT

ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో హై పవర్ కమిటీ విచారణ రెండో రోజు కొనసాగుతుంది. ప్రమాదంతో పాటు ఆ పరిశ్రమకు సంబంధించిన కాలుష్యంపై ప్రజాభిప్రాయాలను సేకరించనుంది. ప్రభావిత గ్రామాల ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను హైవర్ కమిటీ సేకరిస్తుంది. ఈ సమావేశానికి పేర్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తుంది. ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులను కూడా హైపవర్ కమిటీ విచారిస్తుంది. విచారణ చేపడుతున్న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అయితే ఎంపిక చేసిన వారిని మాత్రమే పిలవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News