తిరుమల భక్తులకు హైకోర్టు శుభవార్త

Update: 2018-08-13 12:37 GMT

తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న మహా సంప్రోక్షణ సమయంలో ప్రజలందరికీ అనుమతి దర్శనానికి అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రజలకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ చూసుకోవాలని హైకోర్టు సూచించింది. మహా సంప్రోక్షణ సమయంలో భక్తుల దర్శనానికి అనుమతించమని మొదట టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. పిటీషనర్ తో పాటు టీటీడీ వాదనలు కూడా విన్న కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

Similar News