బ్రేకింగ్ : హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్

రాజధాని భూముల్లో ఇన్‍సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసింది. కిలారు రాజేష్‍తో పాటు మరింత మంది రాజధానిలో భూములు ముందుగానే కొని లబ్ధిపొందారని [more]

Update: 2021-01-19 07:34 GMT

రాజధాని భూముల్లో ఇన్‍సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసింది. కిలారు రాజేష్‍తో పాటు మరింత మంది రాజధానిలో భూములు ముందుగానే కొని లబ్ధిపొందారని ప్రభుత్వం పేర్కొంది. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం కక్షసాధిస్తోందని క్వాష్ పిటిషన్ ను కిలారు రాజేష్ హైకోర్టులో వేశారు. అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. దీంతో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించందని స్పష్టంచేసిన కోర్టు ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టివేసింది.

Tags:    

Similar News