న్యాయవాదుల హత్యపై హైకోర్టు సీరియస్

లాయర్ వామనరావు హత్యపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. న్యాయవాదుల హత్యలు ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయేలా ఉందని అభిప్రాయపడింది. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించింది. [more]

Update: 2021-02-18 06:24 GMT

లాయర్ వామనరావు హత్యపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. న్యాయవాదుల హత్యలు ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయేలా ఉందని అభిప్రాయపడింది. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించింది. ఆధారాలను కూడా సమగ్రంగా సేకరించాలని సూచించింది. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణను వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. నిర్దిష్ట కాలపరిమితితో దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News