నందిగం, ఆమంచిలకు హైకోర్టు నోటీసులు

న్యాయస్థానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ నందిగం సురేష్, వైసీపీనేత ఆమంచి కృష్ణమోహన్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులపై సోషల్ [more]

Update: 2020-05-26 12:22 GMT

న్యాయస్థానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ నందిగం సురేష్, వైసీపీనేత ఆమంచి కృష్ణమోహన్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై కించపరుస్తూ కొందరు కామెంట్లు పెట్టారు. ఈ వివాదంలో మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేశారు. వారిలో ఎంపీ నందిగం సురేష్ తో పాటు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లు ఉన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ఈ కేసును మూడు వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News