ఇక్కడ దోచుకోవడానికి బాబు...??

Update: 2018-11-29 09:22 GMT

తెలంగాణలో ఖాజానాను దోచుకోవడానికే చంద్రబాబు ఇక్కడకు వచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దోచుకు తిన్నది చాలక తెలంగాణకు కూడా వచ్చారన్నారు. టీడీపీ ఇక్కడ మూడు సీట్లను గెలుచుకునే ప్రయత్నంచేస్తుందన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదుచేశామన్నారు. వారిద్దరిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయని, వారి అవినీతి బండారం మొత్తం బట్టబయలయిందని, వారిని అనర్హులుగా ప్రకటించాలని ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు జీవీఎల్ తెలిపారు. చంద్రబాబు తన బినామీలను కాపాడుకునేందుకే జాతీయ స్థాయిలో కూటమి అంటూ పాట మొదలుపెట్టారన్నారు. అన్ని పార్టీలతో జత కట్టిన చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని జీవీఎల్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ తో కలసి నడిస్తే ఏపీ ప్రజలు బట్టలూడి తీసి తంతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీవీఎల్.

Similar News