మేం పెద్దన్న అయితే మీరు దద్దమ్మలా?

ఏపీలో ప్రాంతీయ పార్టీల వల్లనే రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీజేపీ పెద్దన్న పాత్ర పోషించి అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా [more]

Update: 2020-01-21 06:56 GMT

ఏపీలో ప్రాంతీయ పార్టీల వల్లనే రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీజేపీ పెద్దన్న పాత్ర పోషించి అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా అడ్డుకోవాలని టీడీపీ కోరుతుందని, మేం పెద్దన్న పాత్ర పోషిస్తే మీరు దద్దమ్మల్లా వ్యవహరిస్తారా? అని జీవీఎల్ చంద్రబాబుపై ఫైరయ్యారు. చంద్రబాబు ఐదేళ్లు అమరావతిలో ఐదు పర్మినెంట్ బిల్డింగ్ లు కూడా కట్టలేదన్నారు. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న వైసీపీ అందుకు ఆధారాలుంటే రేపటి లోగా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని జీవీఎల్ చెప్పారు. గతంలో శివరామకృష్ణన్ వద్దంటున్నా చంద్రబాబు అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేయడాన్ని తాము అడ్డుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు. అమరావతిని ఉత్తుత్తి రాజధానిగా చేస్తున్నారన్నారు. తాము ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడతామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

Tags:    

Similar News