బాబూ మాట్లాడయ్యా?

పబ్లిసిటీ మీదనే బతికే చంద్రబాబు ఎందుకు ఐటీ దాడులపై స్పందించడం లేదని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ ప్రశ్నించారు. మాట్లాడితే తనపై కూడా దాడులు జరుగుతాయనే [more]

Update: 2020-02-17 07:59 GMT

పబ్లిసిటీ మీదనే బతికే చంద్రబాబు ఎందుకు ఐటీ దాడులపై స్పందించడం లేదని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ ప్రశ్నించారు. మాట్లాడితే తనపై కూడా దాడులు జరుగుతాయనే చంద్రబాబు స్పందించడం లేదని, హైదరాబాద్ కు పారిపోయారని ఆయన అన్నారు. మీరు గాని, మీ పుత్రుడు, మీ దత్త పుత్రుడు ఐటీ దాడులపై స్పందించడం లేదన్నారు. బినామీలైన నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, గల్లా జయదేవ్ లు కూడా మాట్లాడటం లేదన్నారు. ప్రతి చిన్న విషయంపైనా అర్థరాత్రి ప్రెస్ మీట్లు పెట్టే చంద్రబాబు ఎందుకు ఐటీ దాడులు పై పెదవి విప్పడం లేదని అమర్ నాధ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News