ప్రచార యావ.. ప్రాణం తీసింది

ప్రభుత్వం ప్రచార యావ ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. పింఛన్ తీసుకోవడానికి గంటల తరబడి వేచి చూసిన వృద్ధుడు కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం [more]

Update: 2019-02-02 11:17 GMT

ప్రభుత్వం ప్రచార యావ ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. పింఛన్ తీసుకోవడానికి గంటల తరబడి వేచి చూసిన వృద్ధుడు కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన కర్రి వెంకట్ రెడ్డి(75) పింఛన్ లబ్ధిదారుడు. పింఛన్ డబ్బులను అధికారులు ఇస్తారు. అయితే, ఇటీవల పింఛన్ పెంచిన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రమంతటా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చేతులమీదుగా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే లబ్ధిదారులతో అధికారులు సభ ఏర్పాటుచేశారు. అయితే, ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడం, వెంకట్ రెడ్డి ఉదయం నుంచి గంటల తరబడి వేచి ఉండటంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు. అయితే, ఆయన మరణించిన తర్వాత అధికారులు వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు ఇచ్చి వచ్చారు.

Tags:    

Similar News