కర్నూలుకు తరలించేది నిజమే అయినా?

మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించే ప్రతిపాదన ఉన్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఏపీ విజిలెన్స్ కమిషన్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను సచివాలయంలో కార్యాలయాల [more]

Update: 2020-02-18 05:59 GMT

మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించే ప్రతిపాదన ఉన్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఏపీ విజిలెన్స్ కమిషన్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను సచివాలయంలో కార్యాలయాల కొరత కారణంగానే తరలించినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. స్థలం లేనందున తరలిస్తున్నామని, సచివాలయానికి సంబంధం లేని కార్యాలయాలను మాత్రమే తరలిస్తున్నామని ప్రభుత్వం అఫడవిట్ లో పేర్కొంది. కర్నూలులో తగిన భవనాలు ఉన్నట్లు కలెక్టర్ నివేదిక ఇచ్చారని చెప్పింది. ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ జరపనుంది.

Tags:    

Similar News