ఇంత దారుణామా..? ద్వివేదీ కీలక వ్యాఖ్యలు…!

చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ జరపడం సబబేనని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ అభిప్రాయపడ్డారు. ఐదు పోలింగ్ కేంద్రాల్లో వీడియో ఫుటేజీని చూసిన [more]

Update: 2019-05-17 13:06 GMT

చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ జరపడం సబబేనని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ అభిప్రాయపడ్డారు. ఐదు పోలింగ్ కేంద్రాల్లో వీడియో ఫుటేజీని చూసిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఇలా కూడా ఉంటుందా? అన్నంత ఆశ్చర్యం వేసిందన్నారు. దానికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలున్నాయన్నారు. రీపోలింగ్ కు ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఆదేశించేందుకు వీలుందన్నారు. దానికి గడువు అంటూ ఏమీ ఉండబోదని ద్వివేది తెలిపారు. తమకు ఆలస్యంగా తెలియడంతో చంద్రగిరి నియోజెకవర్గంలో ఐదుచోట్ల రీపోలింగ్ కు ఆదేశించామని చెప్పారు. ఐదు చోట్ల రీపోలింగ్ ఈ నెల 19వ తేదీన జరగనుంది. అయితే దీనిని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది.

Tags:    

Similar News