Galla : గల్లా జయదేవ్ పై కేసు నమోదు.. కుటుంబ సభ్యులపై కూడా

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబ సభ్యులపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసు నమోదు చేశారు. తవణంపల్లి [more]

Update: 2021-09-30 06:38 GMT

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబ సభ్యులపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసు నమోదు చేశారు. తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి తన భూమిని గల్లా కుటుంబం ఆక్రమించిందని కోర్టును ఆశ్రయించారు. రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో తన భూమిని ఆక్రమించిందని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గల్లా కుటుంబంపై కేసు నమోదు చేయాలని చిత్తూరు జిల్లా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్రనాయుడుతో పాటు ఎంపీ గల్లా జయదేవ్ పై కూడా భూ ఆక్రమణ కేసును నమోదు చేశారు.

Tags:    

Similar News