తన పాటతో ప్రజలను చైతన్యం చేసి ప్రజా యుద్ధనౌకగా పేరుగాంచిన గద్దర్ రాజకీయ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు, ఆగస్టులో పది లక్షల మంది ప్రజల సమక్షంలో పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఓటు కూడా ఒక పోరాట రూపమని నమ్మి ఓటు రాజకీయాలకు వస్తున్నానని తెలిపారు. భావసారుప్యత కలిగిన పార్టీలు, గ్రామగ్రామాన ప్రజలతో మాట్లాడి పార్టీ విధివిధానాలను రూపొందించనున్నట్లు ఆయన వివరించారు.