నేడు ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ లో నేడు తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 70 లక్షల మందికి పైగానే ఈ ఎన్నికల్లో [more]

Update: 2021-02-09 00:51 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 70 లక్షల మందికి పైగానే ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 2,723 సర్పంచ్, 20,157 వార్డు మెంబర్ పదవులకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ జరగనుంది.

Tags:    

Similar News