అమెరికాలో కాల్పుల్లో తెలుగు యువకుడి మృతి

Update: 2018-09-07 06:10 GMT

అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృత్యువాత పడ్డారు. అమెరికాలోని సిన్సినాటిలోని వాల్ నట్ స్ట్రీట్ లోని ఓ బ్యాంక్ లో ఓమర్ పెరాజ్ అనే దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా, మృతుల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్విరాజ్(25) కూడా ఉన్నారు. పృథ్విరాజ్ మృతిని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం దృవీకరించింది. ఆయన మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Similar News