అమెరికాలో ఘోరప్రమాదం… ముగ్గురు తెలుగువాళ్లు మృతి

అమెరికాలోని కోలిర్విలీలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లతో పాటు మరో వ్యక్తి మరణించారు. చనిపోయిన ముగ్గురు 17 ఏళ్ల లోపు వయస్సు మధ్య పిల్లలే. నల్గొండ జిల్లా [more]

Update: 2018-12-26 07:44 GMT

అమెరికాలోని కోలిర్విలీలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లతో పాటు మరో వ్యక్తి మరణించారు. చనిపోయిన ముగ్గురు 17 ఏళ్ల లోపు వయస్సు మధ్య పిల్లలే. నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని నేరెడుకొమ్మ మండలం గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ – సుజాత దంపతుల హైదరాబాద్ లో నివసిస్తున్నారు. శ్రీనివాస్ నాయక్ కూకట్ పల్లిలోని ఓ చర్చిలో ఫాదర్ గా పనిచేస్తున్నారు. వీరి పిల్లలు స్వాతిక్, సుహాన్, జయ్ సుచిత్ అమెరికాలోని బందువుల ఇంట్లో చదువుకుంటున్నారు. నిన్న స్థానిక చర్చి పెద్ద డేనీ ఇంట్లో క్రిస్మస్ వేడుకల్లో డెకరేషన్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. స్వాతిక్, సుహాన్, జయ్ సుచిత్ తో పాటు మరో మహిళ మరణించగా డేనీ, ఆయన కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News