ఘోర రోడ్డు ప్రమాదం…ఏడుగురి మృతి

అవుటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు ..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాదులోని కార్పెంటర్ పని [more]

Update: 2020-11-10 01:56 GMT

అవుటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు ..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాదులోని కార్పెంటర్ పని చేస్తున్నా పదిమంది కలిసి తమ సొంత గ్రామానికి బయలుదేరారు . వీరంతా కూడా జార్ఖండ్ లోని రామ్ ఘాడ్ ప్రాంతానికి చెందిన వారు. ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయంలో పదిమంది కార్పెంటర్ లు కలిసి వాహనాన్ని తీసుకుని బయలుదేరారు. సంగారెడ్డి ఏరియా లో ఔటరు రింగు రోడ్డు లో గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. వెనకనుంచి అత్యంత బలంగా వాహనం డి కొట్టడంతో చాలా దూరం వరకు వెళ్ళి పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న ఏడుగురు మృత్యువాత పడ్డారు. ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలం పూర్తిగా బీభత్స కరంగా మారిపోయింది. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే వాహనంలో వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అందులో ముగ్గురు మాత్రం పోలీసులు రక్షించగలిగారు. మిగతా వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే వాహనాన్ని ఢీ కొట్టిన వెళ్లిన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News