అమరావతి రైతులు రేపు ఢిల్లీలో

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఈనెల 2వ తేదీన ఢిల్లాలోని గాంధీఘా‌ట్ వద్ద మౌనదీక్ష చేయనున్నారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఉదయం [more]

Update: 2020-10-01 02:52 GMT

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఈనెల 2వ తేదీన ఢిల్లాలోని గాంధీఘా‌ట్ వద్ద మౌనదీక్ష చేయనున్నారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మౌనదీక్ష ఉంటుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలసి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ వినతి పత్రాన్ని ఇవ్వనున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలసి తమ గోడును చెప్పుకోనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని జల్లా కేంద్రాల్లోనూ అమరాతికి మద్దతుగా కార్యక్రమాలను చేపట్టాలని అమరావతి పరరిక్షణ సమితి నిర్ణయించింది.

Tags:    

Similar News