నేడు రాజధాని ప్రాంతంలో బంద్

నేడు రాజధాని ప్రాంతంలో రైతులు బంద్ కు పిలుపు నిచ్చారు. రైతుల అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో నేడు బంద్ [more]

Update: 2020-11-01 02:20 GMT

నేడు రాజధాని ప్రాంతంలో రైతులు బంద్ కు పిలుపు నిచ్చారు. రైతుల అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో నేడు బంద్ పాటిస్తున్నారు. రైతులకు బేడీలు వేసి జైలుకు తీసుకెళ్లడంతో పాటు, జైల్ భరో కార్యక్రమం సందర్భంగా మహిళలపై పోలీసుల దాడిని ఖండిస్తూ రాజధాని అమరావతి జేఏసీ నేడు బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కార్యక్రమానికి సీపీఐ మద్దతిచ్చింది. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజధాని ప్రాంత వాసులు బంద్ కు పిలుపునివ్వడం గమనార్హం.

Tags:    

Similar News