బ్రేకింగ్ : టీడీపీకి మరో షాక్.. వెళుతూ లోకేష్ పై?

విశాఖలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలింది. విశాఖపట్నం రూరల్ టీడీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ [more]

Update: 2020-03-11 05:49 GMT

విశాఖలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలింది. విశాఖపట్నం రూరల్ టీడీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు వ్యతిరేకంగా టీడీపీ తీసుకున్న నిర్ణయంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి రైతులకు న్యాయం చేయమని అడగడంలో తప్పు లేదని, విశాఖకు రాజధానిని తరలించవద్దంటూ అనడం మాత్రం అభ్యంతరకరమన్నారు. ప్రజల్లో నుంచి నాయకుడు పుట్టాలని లోకేష్ ను పరోక్షంగా పంచకర్ల రమేష్ బాబు విమర్శించారు. లోకేష్ పార్టీలో ముఠాలను ప్రోత్సహిస్తు న్నారన్నారు. అందుకే వారసులకు మొన్న లోకేష్ విందు ఇచ్చారని తెలిపారు. విశాఖకు వ్యతిరేకంగా పార్టీ నిర్ణయం తీసుకుంటే నష్టమని తాను చెప్పినా వినలేదన్నారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు పార్టీలో నేతలే కొందరు తప్పుడు సలహాలు ఇస్తున్నారన్నారు.

Tags:    

Similar News