ఆ టిక్కెట్ ను వేలం వేసి అమ్మారు

Update: 2018-11-13 08:14 GMT

కాంగ్రెస్ పార్టీలో మొదటి విడతలో టిక్కెట్ దక్కని నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మంచిర్యాల టిక్కెట్ ఆశించిన అరవింద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల టిక్కెట్ ను వేలం వేసి అమ్మారని, ఆ వేలంలో తాను పాల్గొనలేదని పేర్కొన్నారు. నేర చరిత్ర ఉన్న స్థానికేతరుడికి టిక్కెట్ ఇచ్చారన్నారు. అసాంఘిక శక్తులను ఓడించేందుకు బీజేపీ లేదా బీఎస్పీ నుంచి పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Similar News