జ‌గ‌న్ ను క‌లిసిన మాజీ మంత్రి

Update: 2018-07-19 12:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ను నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి క‌లిశారు. గురువారం ఆనంను వైసీపీ నేత‌లు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిలు లోట‌స్‌పాండ్ కి తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా సుమారు గంట పాటు జ‌గ‌న్‌తో రాంనారాయ‌ణ‌రెడ్డి చ‌ర్చ‌లు జ‌రిపారు. రానున్న ఎన్నిక‌ల్లో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌నే విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఆనం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

Similar News