ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఈటల కుటుంబం భూకబ్జాలకు పాల్పడినట్లు రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు [more]

Update: 2021-05-01 01:13 GMT

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఈటల కుటుంబం భూకబ్జాలకు పాల్పడినట్లు రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. మెదక్ జిల్లా మూసాయిపేట మండలంలో ఈ భూకబ్జాలు జరిగినట్లు చెబుతున్నారు. ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ కోసం వంద ఎకరాలభూమిని కబ్జా చేశారని రైతులు చెబుతున్నారు. అక్రమంగా అసైన్డ్ భూములను కూడా కబ్జా చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. అచ్చంపేట, హకీంపేటలో ఈ భూ కబ్జా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

Tags:    

Similar News