ఈటలను మర్చి పోలేేకపోతున్నారా?

హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడిని ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు ఎత్తులకు పై [more]

Update: 2021-08-08 01:37 GMT

హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడిని ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే ఈ నాయకులు మాత్రం ఇంకా తమ ముఖ్య నాయకుల్లో ఒకరని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల అధ్యక్షురాలు ఎం. స్వర్ణలత, ఆమె భర్త రాజనర్సింగరావు శనివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ తయారు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిలో ఫోటోలు ముద్రించారు. ఇది వైరల్ గా మారింది.

Tags:    

Similar News