జగన్ ఓదార్పు యాత్రకు మద్దతిచ్చిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పదవులు ఇస్తున్నారన్నారు. మానుకోటలో జగన్ ఓదార్పు యాత్రకు మద్దతివ్వడమే కాకుండా [more]

Update: 2021-08-05 05:49 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పదవులు ఇస్తున్నారన్నారు. మానుకోటలో జగన్ ఓదార్పు యాత్రకు మద్దతివ్వడమే కాకుండా ఆరోజు అడ్డుకునేందుకు వెళ్లిన తమపై కౌశిక్ రెడ్డి దాడి చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అటువంటి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమకారులదరూ ఇది గమనించాలని ఈటల రాజేందర్ కోరారు. హుజూరాబాద్ లో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 150 కోట్లు ఖర్చు చేసిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. పెద్దయెత్తున నేతలను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారన్నారు. హుజూరాబాద్ లో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ప్రజల మీద కంటే వారి ఓట్లపైనే ప్రేమఎక్కువగా ఉందన్నారు. కేసీఆర్ ప్రజలను కాకుండా పైసలను నమ్ముకున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

Tags:    

Similar News