చంద్రబాబుకు ఈసీ రిటర్న్ షాక్..?

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశించడంపై పోరాటం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీపోలింగ్ ఎలా [more]

Update: 2019-05-17 13:39 GMT

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశించడంపై పోరాటం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. వైసీపీ ఫిర్యాదు చేస్తే ఎన్నికలు జరిగి 35 రోజుల తర్వాత రీపోలింగ్ ఎలా జరుపుతారని ప్రశ్నించేందుకు చంద్రబాబు వెళ్లగా ఈసీ రిటర్న షాక్ ఇచ్చిందట. ఈ ఐదు పోలింగ్ బూత్ లలో టీడీపీ నేతలు యధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడిన వీడియోను ఈసీ చంద్రబాబు ముందుంచిందని సమాచారం. ఈ వీడియోను చూసి చంద్రబాబు సైతం సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.

Tags:    

Similar News