బ్రేకింగ్: మళ్లీ తెరపైకి ‘ఓటుకు నోటు’ కేసు

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో అప్పటి తెలుగుదేశం పార్టీ నేత, ఇప్పుడు కాంగ్రెస్ లో [more]

Update: 2019-02-01 10:47 GMT

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో అప్పటి తెలుగుదేశం పార్టీ నేత, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి నరేందర్ రెడ్డి అత్యంత సన్నిహితులు. వీరిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు లంచం ఇవ్వబోయి రేవంత్ రెడ్డి ఈ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పుడే వేం నరేందర్ రెడ్డిపైన కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, మరోసారి ఈ కేసు తెర మీదకు రావడం, నరేందర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.

Tags:    

Similar News