పోలీస్ కస్టడీలో రమేష్ బాబు

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో డాక్టర్ రమేష్ బాబు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు రమేష్ బాబు విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో [more]

Update: 2020-11-30 05:54 GMT

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో డాక్టర్ రమేష్ బాబు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు రమేష్ బాబు విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో రమేష్ బాబును పోలీసులు విచారించనున్నారు. మూడు రోజుల పాటు విచారణ జరగనుంది. దాదాపు పది మంది స్వర్ణ ప్యాలెస్ ఘటనలో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్ లో అనధికారికంగా కోవిడ్ సెంటర్ ను రమేష్ ఆసుపత్రి నిర్వహిస్తుందని కేసు నమోదయింది. కొద్దిసేపటి క్రితం విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు రమేష్ బాబు చేరుకున్నారు.

Tags:    

Similar News