వైద్యం చేయాలని తీసుకెళ్లి..మర్డర్ చేసి...?

Update: 2018-05-11 07:57 GMT

కర్నూల్ జిల్లా డోన్ లో ఓ వైద్యుడు దారుణహత్యకు గురయ్యాడు. డోన్ పట్టణానికి చెందిన వైద్యుడు, టీడీపీ నేత పోచ ప్రభాకర్ రెడ్డి కుమారుడు పోచ శ్రీకాంత్ రెడ్డి(47) వృత్తిరిత్యా వైద్యుడు. గురువారం మధ్యాహ్నం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమవారికి చికిత్స చేసేందుకు రావాలని ఆయనను కోరారు. దీంతో వెంటనే శ్రీకాంత్ రెడ్డి వారితో కలిసి ఆటోలో వెళ్లాడు. సాయంత్రానికి కూడా తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందొళన చెందారు. శ్రీకాంత్ ఆచూకీ కోసం గాలించగా, స్థానిక ఇండోర్ స్టేడియం సమీపంలో శవమై పడి ఉన్నాడు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వైద్యుడిగా ఆపదలో ఉన్నవారికి మంచి చేద్దామని వెళితే హతమార్చడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైద్యం కోసం ఆటోలో తీసుకెళ్లిన వ్యక్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు శ్రీకాంత్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ హత్యపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Similar News