టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత వేటుపై?

ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల అనర్హత పిటీషన్ పై విచారణ జరుగుతుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు మరోసారి విచారించాలని ఛైర్మన్ [more]

Update: 2020-06-15 04:12 GMT

ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల అనర్హత పిటీషన్ పై విచారణ జరుగుతుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు మరోసారి విచారించాలని ఛైర్మన్ నిర్ణయించారు. టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధ్ రెడ్డిలపై విచారణ జరుపుతారు. పార్టీ విప్ ను థిక్కరించారంటూ వీరిద్దరిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. దీంతో శాసనమండలి ఛైర్మన్న విచారణ జరుపుతున్నారు. అయితే శివనాధ్ రెడ్డి మాత్రం తాను గవర్నర్ కోటాలో ఎన్నికయినందున విప్ చెల్లదంటున్నారు.

Tags:    

Similar News