ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్థితిపై…?

సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రకు రాజమండ్రిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కోర్టు తీర్పు మేరకు ఆయనను రాజమండ్రిలోని డెల్టా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. [more]

Update: 2021-05-16 00:55 GMT

సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రకు రాజమండ్రిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కోర్టు తీర్పు మేరకు ఆయనను రాజమండ్రిలోని డెల్టా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ధూళిపాళ్ల నరేంద్ర కరోనా వైరస్ తో బాధపడుతున్నారు. ఆయనను రాజమండ్రి జైలుకు తరలించడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది. ఆయనకు ప్రయివేటు వైద్య శాలలో చికిత్స అందించాలని ఆదేశించింది. దీంతో ఆయనకు ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యాన్ని అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఈ నెల 20 వతేదీన నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News