బ్రేకింగ్ : త్వరలోనే విశాఖలో పరిపాలన రాజధానికి శంకుస్థాపన

వీలయినంత త్వరలో విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని శంకుస్థాపన ఉంటుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ నెల 15వ తేదీన మాత్రం జరగదని చెప్పారు. ఈ [more]

Update: 2020-08-12 07:07 GMT

వీలయినంత త్వరలో విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని శంకుస్థాపన ఉంటుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ నెల 15వ తేదీన మాత్రం జరగదని చెప్పారు. ఈ నెల పదిహేనో తేదీన జరిగే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కూడా వాయిదా పడిందని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అయితే త్వరలోనే విశాఖపట్నం లో పరిపాలన రాజధాని శంకుస్థాపన తేదీని ప్రకటిస్తామని ధర్మాన తెలిపారు. మూడు రాజధానులు ఏపీలో ఖచ్చితంగా ఏర్పడతాయన్నారు. తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందనే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకోవాల్సి వస్తుందన్నారు.

Tags:    

Similar News