కేసులకు భయపడే వాడిని కాదు

తనపై కేసు పెట్టడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలను తాను వీడియో రూపంలో ప్రదర్శిస్తే తనపై తప్పుడు [more]

Update: 2021-04-12 01:24 GMT

తనపై కేసు పెట్టడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలను తాను వీడియో రూపంలో ప్రదర్శిస్తే తనపై తప్పుడు కేసులు పెడతారా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. కేసులకు తాను భయపడపోనని చెప్పారు. ఈ కేసుకు 505 సెక్షన్ ఎలా అప్లయ్ అవుతుందని దేవినేని ఉమ ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో కుక్కకు విషం పెట్టి ఎవరు చంపారో ముందు చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News