జగన్ పిచ్చి చర్యలకు భయపడం

జగన్ చేస్తున్న పిచ్చి చర్యలకు తాము భయపడే ప్రసక్తి లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వారిచేత తమను తిట్టిస్తున్నారని, జగన్ [more]

Update: 2019-11-16 07:21 GMT

జగన్ చేస్తున్న పిచ్చి చర్యలకు తాము భయపడే ప్రసక్తి లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వారిచేత తమను తిట్టిస్తున్నారని, జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ ను వల్లభనేని వంశీ చదువుతున్నారని దేవినేని ఉమ అన్నారు. జగన్ అసెంబ్లీలో శ్రీరంగనీతులు చెప్పారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయించకుండా తమ పార్టీ ఎమ్మెల్యేను వైసీపీలోకి ఎలా చేర్చుకుంటారని దేవినేని ఉమ అన్నారు. జగన్ జైలుకు వెళ్తాడని తెలిసి వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, అందుకోసమే జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు వల విసురుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.

Tags:    

Similar News