లక్షకు చేరుకోవడానికి ఎంతో దూరం లేదు… మరణాలు కూడా?

భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 3,722 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయిి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 134 మంది [more]

Update: 2020-05-14 05:01 GMT

భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 3,722 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయిి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 134 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరగ్యశాఖ హెల్త్ బులిటెన్ ను విడుదలచేసింది. ఇప్పటి వరకూ దేశంలో మొత్త 78,003 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 49219 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2,549కు చేరుకుంది. ఇదే ఒరవడి కొనసాగితే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News