తగ్గినట్లే కన్పిస్తోంది… అధికారుల మాటల్లో నిజమెంత?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొంత తగ్గుతున్నట్లే కన్పిస్తుంది. ప్రతిరోజు 80 కేసులకు తగ్గకుండా నమోదయ్యేవి. అయితే గత కొద్ది రోజులుగా ముప్ఫయి కేసులకు మించడం లేదు. [more]

Update: 2020-05-13 02:49 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొంత తగ్గుతున్నట్లే కన్పిస్తుంది. ప్రతిరోజు 80 కేసులకు తగ్గకుండా నమోదయ్యేవి. అయితే గత కొద్ది రోజులుగా ముప్ఫయి కేసులకు మించడం లేదు. ఇది కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనడానికి నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలలో కరోనా ఏపీని కుదిపేసింది. ప్రతిరోజూ 70 నుంచి 80 కేసులు నమోదయ్యేవి. అయితే గత రెండు వారాలుగా కేసులు ముప్ఫయికి మించడం లేదు. కోయంబేడు మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండి ఉంటే ఈపాటికి ఏపీలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేందని అధికారులు చెబుతున్నారు. అలాగే నమోదయ్యే కేసుల కంటే డిశ్చార్జ్ అవుతున్న వారు ఎక్కువగా ఉండటం ఊరట నిచ్చే అంశమి అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News