బ్రేకింగ్ : పదహారు వేలు మార్క్ దాటేసిన ఏపీ.. మరణాలు కూడా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటల్లో కొత్తగా 845 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

Update: 2020-07-02 08:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటల్లో కొత్తగా 845 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,097 కు చేరుకుంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదయిన కేసుల్లో 812 మంది ఏపికి చెందిన వారు కాగా, 29 మంది ఇతర రాష్ట్రాల నంచి వచ్చిన వారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి కరోనా సోకింది. ఒక్కరోజులో ఐదుగురు కరోనాతో మరణించారు. దీంతో ఏపీలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 198కి చేరుకుంది.

Tags:    

Similar News