ఏపీలో ఆగని కరోనా….మరణాల సంఖ్య పెరుగుతోంది

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజే 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాధి బారిన పడిన [more]

Update: 2020-07-11 12:40 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఒక్కరోజే 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 27,235కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో పదిహేడు మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 309కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో 1775 మంది ఏపీకి చెందిన వారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కరోనా సోకినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

Tags:    

Similar News