కేసులు పెరిగిపోతున్నాయి… నిన్న ఒక్కరోజే?

భారత్ ను కరోనా భయం ఇప్పట్లో వీడేట్లు లేదు. భారత్ లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. నిన్న ఒక్క రోజే 179 కరోనా [more]

Update: 2020-03-29 03:51 GMT

భారత్ ను కరోనా భయం ఇప్పట్లో వీడేట్లు లేదు. భారత్ లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. నిన్న ఒక్క రోజే 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 900 కు పైగా భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గించే విషయమే. ఇప్పటి వరకూ భారత్ 20 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. స్వీయ నిర్భంధాన్ని ప్రజలు పాటించకపోతే మరింతగా కరోనా పాజిటివ్ సంఖ్య పెరిగే అవకాశముంది.

Tags:    

Similar News