కర్ణాటకలో లాక్ డౌన్ తప్పేట్లు లేదు

కర్ణాటకలో కరోనా కేసులు తీవ్రత పెరిగింది. కేసుల తీవ్రత పెరుగుతుండటం, ప్రజలు కరోనాకు భయపడకపోవడంతో యడ్యూరప్ప లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉప ఎన్నికలు [more]

Update: 2021-04-14 01:21 GMT

కర్ణాటకలో కరోనా కేసులు తీవ్రత పెరిగింది. కేసుల తీవ్రత పెరుగుతుండటం, ప్రజలు కరోనాకు భయపడకపోవడంతో యడ్యూరప్ప లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉప ఎన్నికలు ఉండటంతో ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఉప ఎన్నికలు ఈ నెల 17వ తేదీన ముగుస్తాయి. పదిహేడు తర్వాత కర్ణాటకలో లాక్ డౌన్ ను విధించే అవకాశాలున్నాయి. ఈ నెల 18, 19 తేదీల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. కర్ణాటకలో రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

Tags:    

Similar News